బీజేపీ అంటే బాబు, జగన్, పవన్..: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల

ఏపీలో బీజేపీపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్( Babu, Jagan, Pawan ) అని విమర్శించారు.

టీడీపీ, వైసీపీ, జనసేనల్లో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోకే వెళ్తాయని షర్మిల తెలిపారు.దేశంలో మిగిలిన చోట్ల బీజేపీకి వేరే అర్థమున్నా ఏపీలో మాత్రం ఇదే అర్ధమని స్పష్టం చేశారు.

బీజేపీతో దోస్తీ కోసమే చంద్రబాబు, జగన్ ఏపీని తాకట్టు పెట్టారని ఆరోపించారు.ఈ క్రమంలోనే తనదీ వైఎస్ఆర్ రక్తమేనన్న ఆమె విమర్శలు చేయడం తన ఉద్దేశం కాదని చెప్పారు.

వైఎస్ఆర్, జగన్ పాలనకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide