ఎంపి అవినాష్ రెడ్డి జైలుకెళ్ళడం ఖాయం - బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్

ఎంపి అవినాష్ రెడ్డి జైలుకెళ్ళడం ఖాయమన్నారు బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్.వివేకానందరెడ్డి హత్య వెనుక ఎవరెవరు ఉన్నారో వారందరూ జైలుకెళ్ళక తప్పదన్నారు.

సిబిఐపైనే కేసులు పెట్టడం వైసిపి పాలనకు నిదర్శనమని, మీడియాపై వైసిపి కార్యకర్తల దాడిని ఖండిస్తున్నానన్నారు.జగన్ ను కాపాడాల్సిన అవసరం బిజెపికి లేదన్న సత్య కుమార్ దేశ ప్రజలు బిజెపిని ఇంకా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

కర్ణాటక ఎన్నికల్లో ఓడినా, ఓట్ల శాతం మాత్రం బిజెపికి పెరిగిందన్నారు.రాను ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పొత్తుల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందన్నారు.

పంచభూతాల్లో ఏ ఒక్క దాన్ని వదలకుండా వైసిపి నేతలు దోచేస్తున్నారని, వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు.

Advertisement
ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్‌కు కీలక పదవి .. టెక్సాస్ గవర్నర్ ఆదేశాలు

తాజా వార్తలు