బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గనిపిస్తోంది..: వీహెచ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.

తన జీవితంలో 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం చూడలేదని తెలిపారు.అంబేద్కర్ రాజ్యాంగాన్ని మోదీ, అమిత్ షా తుంగలో తొక్కారని వీహెచ్ ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇండియా కూటమిపై ఉందన్నారు.కాగా ఇండియా కూటమి పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు.

Advertisement
జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?

తాజా వార్తలు