ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు..ముగింపు దశకు దీక్షలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు.భవానీ దీక్షలు(Bhavani Deeksha) ముగింపు దశకు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో కనకదుర్గమ్మ ఆలయానికి( Kanakadurga Temple ) బారులు తీరారు.

పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నాయి.గత ఐదు రోజులుగా దుర్గమ్మను దర్శించుకుని సుమారు 5.5 లక్షల మంది భవానీలు దీక్ష విరమణ చేశారని తెలుస్తోంది.అమ్మవారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించుకుంటున్నారు.

Bhavanis Huge Crowd In Indrakeeladri Temple Details, Bhavani Deeksha, Kanakadurg

ఈ నేపథ్యంలోనే ఇవాళ, రేపు కూడా అమ్మవారి దర్శనం కోసం భక్తులతో పాటు భవానీలు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.భవానీల రద్దీతో ఆలయ అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

భక్తులకు( Devotees ) ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
అమెరికాను కాదని ఇండియాలో పిల్లల్ని పెంచుతున్న మహిళ.. ఆమె చెప్పిన 8 కారణాలు తెలిస్తే వావ్ అనాల్సిందే!

తాజా వార్తలు