ఏపీ పంచాయతీ కార్యదర్శిల భర్తీకి నోటిఫికేషన్ విడుదల !

ఏపీలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త .మొత్తం 1051 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం (డిసెంబర్ 21) నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 27 నుంచి జనవరి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ.

పంచాయతీ శాఖలో కొత్తగా 1000 ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.వీటితో పాటు గతంలో భర్తీ చేయకుండా మిగిలి ఉన్న 51 ఉద్యోగాలను కూడా కలిపి మొత్తం 1051 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పోస్టుల భర్తీకి 2019 ఏప్రిల్‌ 21న ప్రిలిమినరీ పరీక్ష, ఆగస్టు 2న మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

జిల్లాల వారీగా ఖాళీలు:

శ్రీకాకుళం - 107 విజయనగరం - 119 విశాఖపట్నం - 105 తూర్పు గోదావరి - 92 పశ్చిమ గోదావరి - 21 కృష్ణా - 19 గుంటూరు - 48 ప్రకాశం - 167 నెల్లూరు - 62 చిత్తూరు - 134 అనంతపురం - 38 కర్నూలు - 88 కడప - 0

ముఖ్యమైన తేదీలు.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: డిసెంబర్ 27 నుంచి జనవరి 19 ప్రిలిమినరీ పరీక్ష: 2019 ఏప్రిల్‌ 21 మెయిన్స్ పరీక్ష: 2019 ఆగస్టు 2 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in

Advertisement
సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు