బడా బ్యానర్లో అనుష్క కొత్త సినిమా... షూటింగ్ ప్రారంభమయ్యేది ఆరోజే?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బాహుబలి సినిమా తర్వాత అనుష్క నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.ఈ సినిమా తర్వాత అనుష్క ఎలాంటి సినిమా అప్డేట్స్ ఇవ్వకుండా సోషల్ మీడియా, మీడియాకి దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియాకి కూడా దూరంగా ఉండడంతో ఈమె గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.ఇలా అనుష్క గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఈమె యు.

వి.క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక తాజాగా ఈ విషయం గురించి యు వి క్రియేషన్స్ బ్యానర్ అప్డేట్ విడుదల చేశారు.

Advertisement

జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి అనుష్క ఈ బ్యానర్లో ఓ సినిమా చేయనుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 4వ తేదీ షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు.

ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకి ఏ విధమైనటువంటి టైటిల్ అనుకోలేదు.యు వి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క నవీన్ పోలిశెట్టి జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రారా.కృష్ణయ్య దర్శకుడు మహేష్‌ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక అనుష్క యు.వి క్రియేషన్స్ బ్యానర్లో ఇది వరకే మిర్చి, భాగమతి వంటి చిత్రాలలో నటించారు.ఇక అనుష్క తన 48వ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో చేయటం విశేషం.

మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?
Advertisement

తాజా వార్తలు