Amanchi Swamulu : చీరాల సమన్వయకర్త పదవికి ఆమంచి రాజీనామా..!!

బాపట్ల జిల్లా చీరాలలో జనసేన పార్టీకి షాక్ తగిలింది.నియోజకవర్గ సమన్వయకర్త పదవికి ఆమంచి స్వాములు రాజీనామా చేశారు.

ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు( Nadendla Manohar ) లేఖ రాశారు.వ్యక్తిగత కారణాల వలన తాను చీరాల నియోజకవర్గ సమన్వయకర్తగా తప్పుకుంటున్నట్లు చెప్పిన ఆమంచి( Amanchi Swamulu ) తన అభ్యర్థనను అంగీకరిస్తానని భావిస్తానని లేఖలో పేర్కొన్నారు.

అనంతరం ఆమంచి మాట్లాడుతూ సమన్వయకర్తగా మాత్రమే తప్పుకుంటున్నానని తెలిపారు.జనసేనలోనే కొనసాగుతానంటూ ఆమంచి స్వాములు ప్రకటించారు.అయితే గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను ఆశించిన ఆమంచి స్వాములుకు జనసేన పార్టీ( Janasena party ) అధిష్టానం చీరాల సమన్వయకర్త బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.

ఈ అసంతృప్తితోనే ఆయన సమన్వయకర్తగా తప్పుకున్నారని తెలుస్తోంది.

Advertisement
కమెడియన్ లతో ఆడి పాడిన హీరోయిన్స్ వీరే !

తాజా వార్తలు