పేరెంట్స్ విడాకులు.. మేము కూడా మనుషులమే.. అక్షర హాసన్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ (Kollywood )ఇండస్ట్రీలో అక్షర హాసన్ కు నటిగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

తక్కువ సినిమాలే చేసినా అక్షర హాసన్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

అక్షర హాసన్( Akshara Haasan ) పేరెంట్స్ విడాకుల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.స్టార్ స్టేటస్ కు దూరంగా ఉన్న అక్షర హాసన్ తన తల్లీదండ్రుల విడాకులు ఎంతో బాధ పెట్టాయని తెలిపారు.

సెలబ్రిటీల పిల్లలు అయినంత మాత్రాన మాకు ఎమోషన్లు ఉండవా అని ఆమె ప్రశ్నించారు.మేము కూడా మనుషులమే అని అక్షర హాసన్ పేర్కొన్నారు.పేరెంట్స్ విడిపోతే అందరూ ఎలా బాధ పడతారో మేము కూడా అలాగే బాధ పడ్డామని ఆమె వెల్లడించారు.

కానీ వారు మమ్మల్ని ఒంటరిగా వదిలేయలేదని అక్షర హాసన్ పేర్కొన్నారు.తల్లీదండ్రులు మాపై ఎంతో ప్రేమను చూపించారని ఆమె చెప్పుకొచ్చారు.తమ తల్లీదండ్రుల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా తల్లీదండ్రులుగా మాకు అండగా నిలబడ్డారని అక్షర హాసన్ పేర్కొన్నారు.

Advertisement

కొన్నిసార్లు నాకు ఏదైనా అవసరమైతే అక్క దగ్గరకు వెళ్లేదానినని ఆమె చెప్పుకొచ్చారు.స్కూల్ లో ఎవరైనా ఏడిపిస్తే వాళ్లను కొట్టాలని చెబితే అక్క హింస వద్దని చెప్పేదని అక్షర హాసన్ వెల్లడించారు.

అక్క రంగంలోకి దిగి పరిస్థితులను చక్కబెట్టేదని ఆమె అన్నారు.

అక్క, నేను ఒకరికొకరం నిలబడతామని ఇప్పటికి కూడా మేము అలాగే ఉన్నామని అక్షర హాసన్( Akshara Haasan ) తెలిపారు.ఎన్ని సవాళ్లు ఎదురైనా కుటుంబంలో అందరూ ఒకరికొకరు సపోర్ట్ గా నిలుస్తారని ఆమె వెల్లడించారు.ఆ ప్రేమానురాగాలను అలాగే కొనసాగించామని ఆమె అన్నారు.

అక్షర హాసన్ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అక్షర హాసన్ ఇబ్బందులు తెలిసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.

అంబానీ ఫ్యామిలీపై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఎంతో స్ఫూర్తిని పొందాం అంటూ?
Advertisement

తాజా వార్తలు