అఖిల‌కు టిక్కెట్ టెన్ష‌న్‌... ఆ వ్యాఖ్య‌ల మ‌ర్మ‌మేంటో..!

ఏపీ కేబినెట్‌లో త‌క్కువ వ‌య‌స్సు ఉన్న మంత్రిగా ఉన్న భూమా అఖిల‌ప్రియ రాజ‌కీయ ప్ర‌స్థానం ప‌డుతూ లేస్తున్న‌ట్టు సాగుతోంది.

ఏక‌గ్రీవంగా ఎమ్మెల్యేగా గెలిచిన అఖిల ఆ త‌ర్వాత తండ్రి నాగిరెడ్డి మృతితో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా మంత్రి అయ్యారు.

ఆమెకు ఇచ్చిందే పెద్ద‌గా ప్రాధాన్య‌త లేని శాఖ‌.రాజ‌కీయంగా ఆమె ఆరితేర‌క‌పోవ‌డంతో స‌రైన వ్యూహాలు ప‌న్న‌లేక‌పోతున్నారు.

రోజు రోజుకు ఆమెకు జిల్లాలో సొంత పార్టీలోనే శ‌త్రువులు ఎక్కువైపోతున్నారు.ముందుగా ఆళ్ల‌గ‌డ్డ సీటు విష‌యంలో ఏవి.సుబ్బారెడ్డితో ఆమెకు స్టార్ట్ అయిన ర‌గ‌డతో సుబ్బారెడ్డి ఒక్క‌రే అఖిల‌కు శ‌త్రువు కాలేదు.ఇటు జిల్లాకే చెందిన సీనియ‌ర్ మంత్రి కేఈ.కృష్ణ‌మూర్తితోనూ ఆమెకు అంత స‌ఖ్య‌త లేదు.ఇక తాజాగా బ‌న‌గాన‌ప‌ల్లె బీసీ.

జ‌నార్థ‌న్‌రెడ్డి సైతం ఆమెపై నేరుగా చంద్ర‌బాబుకే ఫిర్యాదు చేశారు.అఖిల మామ అయిన కాట‌సాని రామిరెడ్డి జ‌నార్థ‌న్‌రెడ్డికి బ‌న‌గాన‌ప‌ల్లెలో వైసీపీ నుంచి ప్ర‌త్య‌ర్థిగా ఉన్నారు.

Advertisement

అఖిల ఆయ‌న‌కు కాంట్రాక్టులు ఇస్తూ ఆయ‌న్ను ఎంక‌రేజ్ చేస్తున్నార‌న్న ఆరోప‌ణ జ‌నార్థ‌న్‌రెడ్డిది.ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ సీటు అఖిల‌కు వ‌స్తుందా ? రాదా ? అన్న‌దానిపై కూడా ర‌క‌ర‌కాల సందేహాలు వినిపిస్తున్నాయ్‌.క‌నిపిస్తున్నాయ్‌.

ఆమె వైసీపీలోకి వెళ్లిపోయే ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ వార్త‌ల‌పై అఖిల్ మాట్లాడారు.

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని ఏపీ మంత్రి అఖిలప్రియ స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

అయితే ఇక్క‌డే ఆమో నిర్వేదంగా మాట్లాడిన‌ట్టు క‌నిపిస్తోంది.ఆళ్లగడ్డ సీటును సీఎం చంద్రబాబు చేతిలో పెడతానని, ఎవరికి ఇచ్చేది ఆయన ఇష్టమని, చంద్రబాబు చెప్పిన స్థానం నుంచే తాను పోటీ చేస్తానని అన్నారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమా ఫ్యామిలీకి నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ రెండు సీట్లు ఇచ్చే విష‌యంలో చంద్ర‌బాబు సుముఖంగా లేన‌ట్టు తెలుస్తోంది.ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టిక్కెట్ విష‌యంలో అఖిల‌లో ఏదో డౌట్ కొడుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోందని ఆమె మాట‌లే చెప్పేస్తున్నాయ్‌.!.

Advertisement

తాజా వార్తలు