ఖమ్మం పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం

పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది.ఖమ్మం జిల్లాలోని ఖానాపురం హావేలి పీఎస్ లో ఈ ఘటన జరిగింది.

చోరీ చేసిన వ్యక్తిని వదిలేసి కిరాయికి వెళ్లిన తనని పోలీసులు వేదిస్తున్నారని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్ రాము స్టేషన్ లోనే పురుగుల మందు తాగాడు.వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో రాముని నేరం ఒప్పుకోవాలని పోలీసులు కొడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement