జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కి న్యాయపరమైన చిక్కులు తొలగిన సంగతి తెలిసిందే.గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ నిన్న హైకోర్టు ధర్మాసనం.
జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కి అనుమతులు ఇవ్వడం జరిగింది.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని.
ఎన్నికల సంఘం అధికారులతో నేడు భేటీ కానున్నారు.కౌంటింగ్ చేపట్టేందుకు అవసరమైన సిబ్బంది, పటిష్టమైన భద్రతా చర్యలపై నేడు జరిగే సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు.
ఈ నెల 19వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అదే రోజు ఫలితాలు వెల్లడించాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకున్నది.
దీంతో ఎన్నికలు జరిగినా 515 జడ్పిటిసి స్థానాలు అదే రీతిలో 7321.
ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపుకి… ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పట్లో రాష్ట్రంలో మొత్తం 9,692 ఎంపీటీసీ, 652 జడ్పీటీసీ సీట్లకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగా 2,371 ఎంపీటీసీ స్థానాలు, 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
పలు కారణాల వల్ల 354 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక ఆగింది.మిగిలిన 7,321 ఎంపీటీసీ స్థానాలకు, 515 జడ్పీటీసీ స్థానాలకు.
ఎన్నికలు జరిగిన ఈ క్రమంలో వాటి ఫలితాలు సెప్టెంబర్ 19 వ తారీఖున.ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయ్యింది.