తెలుగులో 2018 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటీ దర్శకత్వం వహించిన “హుషారు” అనే చిత్రంలో లో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యంగ్ బ్యూటీ దక్ష నగర్కార్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తన నటన, అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .
అయితే ఈ చిత్రంలో నటించడానికంటే ముందుగా “హోరాహోరీ” అనే చిత్రంలో నటించినప్పటికీ ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న “జాంబి రెడ్డి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రంలో బస్ స్టాప్ చిత్ర ఫేమ్ “ఆనంది” అలాగే ఇంద్ర చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన “తేజ సజ్జ” తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
అయితే తాజాగా దక్ష నగర్కార్ తన సినీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా ఆ మధ్య దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన “అ!” చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని కానీ పలు అనివార్య కారణాల వల్ల నటించ లేక పోయానని చెప్పుకొచ్చింది.అయితే తాను మిస్ చేసుకున్నటువంటి పాత్రలో “నిత్య మీనన్” నటించిందని తెలిపింది.
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తనకి ఆ పాత్రలో నటించే అవకాశం వచ్చి ఉంటే కచ్చితంగా నటించే దాన్నని తెలిపింది.
ఇక ప్రస్తుతం తాను జాంబి రెడ్డి అనే చిత్రంలో నటించానని ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ కి వెళ్లి చూడాలని కోరింది.
అయితే ఈ చిత్రం హర్రర్ తరహాలో ఉన్నప్పటికీ ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.అలాగే తాను హుషారు చిత్రంలో నటించిన తర్వాత డిఫరెంట్ జోనర్ లో ఈ చిత్రంలో నటించానని కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నట్లు తెలిపింది.
అయితే ఈ చిత్రం ఈనెల 5వ తారీఖున విడుదలవుతోంది.ఇప్పటికే ట్రైలర్ ద్వారా సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులు కొట్టేసిన ఈ చిత్రం మరి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.