యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సినిమా జాంబీ రెడ్డి.నిన్న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
తెలుగులో జాంబీ జానర్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.సినిమాలో దీక్ష నగార్కర్, ఆనంది హీరోయిన్లుగా నటించగా ఆర్జే హేమంత్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. హర్రర్ జోనర్ లో కమర్షియల్ అంశాలను మేళవించి ప్రశాంత్ వర్మ తెలుగు నేటివిటీకి తగిన విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు.సినిమాలోని కొన్ని సన్నివేశాలు గతంలో చూసిన కొన్ని సినిమాలను గుర్తు తెచ్చినా తొలి సినిమాతోనే తేజ సజ్జ నటుడిగా కూడా పేరు తెచ్చిపెట్టే సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.
బాల నటుడిగా తేజ సజ్జ చాలా సినిమాల్లో నటించడంతో అనుభవం ఉన్న హీరోలా నటించారు.
అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు జాంబీల కథాంశాన్ని ఇష్టపడతారా.? లేదా.? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.క్లైమాక్స్ అందరికీ నచ్చే విధంగా లేకపోయినా సినిమాలో నటించిన నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.కెమెరా వర్క్, నేపథ్య సంగీతం ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి.
బడ్జెట్ పరిమితులు ఉన్నా ఈ సినిమాను నిర్మాత రిచ్ గానే తెరకెక్కించారు.
ఫస్టాప్ కొంతవరకు సాగదీసినట్లు అనిపించినా సెకండాఫ్ మాత్రం బాగుంది.
జాంబీలు చేసే విన్యాసాలు బాగానే ఉన్నా మితిమీరిన హింస ఒక వర్గం ప్రేక్షకులను సినిమాకు దూరం చేసే అవకాశాలు ఉన్నాయి.మరి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న జాంబీ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకుంటుందో చూడాల్సి ఉంది.