దేశంలో బీజేపీ పాలన కారణంగానో, లేక మరి ఏ ఇతర కారణాలో తెలియదు కాని ఈ మధ్యకాలంలో చాలా మందిలో మతపిచ్చి ఎక్కువైపోతుంది.మూఢ మతతత్వంతో దారుణమైన బావజాలంతో మన మధ్య చాలా మంది తిరుగుతున్నారు.
గో సంరక్షులు పేరుతో ఉత్తర భారతం తరుచుగా జరిగే దాడులు గురించే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ మధ్య బెంగుళూరులో ఓలా క్యాబ్ డ్రైవర్ హిందువు కాదని ఓ వ్యక్తి రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు.
ఆ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.ఈ స్థాయిలో మతం పిచ్చి ఉన్న వాళ్ళు మన మధ్య ఉన్నారా అని చాలా మంది ఆశ్చర్యపోయారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ లో తాజాగా ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో ఓ వ్యక్తి ఇచ్చిన ఆర్డర్ రద్దు చేసుకున్నాడు.దానికి కారణం ఫుడ్ డెలివరీ బాయ్ హిందూయేతరుడు కవాడం అని అతనే ఏదో గొప్ప పని చేసినట్లు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.
పా అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసాడు.డెలివరీ బాయ్ ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళాడు.అయితే అతను హిందూయేతరుడు కావడంతో డెలివరీ బాయ్ని మార్చమని జోమాటోను అడిగాడు.అది సాధ్యం కాదని జొమాటో సమాధానం ఇచ్చింది.
అలాగే డబ్బులు కూడా తిరిగి చెల్లించడం కుదరదని తేల్చి చెప్పింది.దీంతో తన ఆర్డర్ను రద్దు చేసుకోవడంతో పాటు తనకు రాఫండ్ కూడా అవసరం లేదని జోమాటోకు సమాధానం ఇచ్చాడు అమిత్ దీనికి జుమాటో కూడా గట్టిగా రిప్లై ఇచ్చింది.
ఆహారానికి మతం లేదు.ఆహరామే మతం ని కామెంట్ చేసింది.
దీనికి నెటిజన్స్ నుంచి ప్రశంసలు రావడంతో, డెలివరీ క్యాన్సిల్ చేసిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు.