టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.
అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.టాక్ తో పని లేకుండానే బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.అయితే ఇంత ఘన విజయం సాధించిన ఈ సినిమా ఎప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ మీద వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.
ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ ఓటిటి డేట్ ఫిక్స్ చేసారు.
ఈ సినిమా రిలీజ్ అయినా తర్వాత 100 రోజులకు ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయాలని రాజమౌళి అనుకున్నారు.కానీ ఈ సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటిటి లోకి తీసుకు రానున్నారు.మే 20 నుండి ఈ సినిమా జీ 5 ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది.అయితే జీ 5 వారు ఈ సినిమాను ముందుగా పే ఫర్ వ్యూ అని పెట్టాలని అనుకున్నారు.
కానీ ఫ్యాన్స్ అంతా గట్టిగా పట్టుబట్టడంతో వారికీ తలొగ్గక తప్పలేదు.దీంతో నిర్ణయం మార్చుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఈ సినిమాను సబ్ స్క్రిప్షన్స్ చేసుకున్న వారు ఫ్రీ గా చూడవచ్చు అని చెప్పడంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.