సినిమా హీరోయిన్లకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.హీరోయిన్లు క్రేజ్ ను సరిగ్గా క్యాష్ చేసుకుంటే రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.
వెండితెర హీరోయిన్లలో ఒకరైన కృతిశెట్టి నటించిన ఉప్పెన సినిమాతో ఆమెకు నటిగా మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ బ్యూటీ జీ తెలుగు ఛానల్ లో కొత్తగా ప్రసారమవుతున్న సీరియల్ లో మెరిశారు.
ఆ ఛానల్ ప్రసారం కాబోయే ఈవెంట్లలో కూడా కృతిశెట్టి కనిపించబోతున్నారని ఇందుకోసం ఏకంగా ఆమె కోటి రూపాయలు అందుకుంటున్నారని తెలుస్తోంది.
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే కృతిశెట్టి ప్రముఖ ఛానల్స్ తో ఒప్పందాలు చేసుకుంటూ ఉండటం గమనార్హం.
క్యూట్ ఎక్స్ ప్రెషన్లతో ప్రేక్షకుల మనస్సు దోచుకుంటున్న ఈ బ్యూటీ కెరీర్ ను సైతం చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.స్టార్ హీరోలు సైతం తమ సినిమాలతో కృతిశెట్టిని తీసుకోవాలని భావిస్తుండగా ఒక్క సినిమా సక్సెస్ తోనే కృతిశెట్టి రికార్డు స్థాయిలో స్టార్ హీరోయిన్లకు ధీటుగా రెమ్యునరేషన్ ను పెంచేశారు.
చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉన్న ఈ బ్యూటీ కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించారు.సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ కు కూడా తొలి సక్సెస్ దక్కింది.
బెంగళూరులో పుట్టిన కృతిశెట్టి ముంబైలో పెరిగారు.గతంలో మహేష్ బాబు, రమ్యకృష్ణ సైతం ఈ విధంగా ఒప్పందాలు కుదుర్చుకుని టీవీ ఛానల్స్ లో కనిపించి సందడి చేశారు.
దాదాపు 2వేల మందిలో ఉప్పెన మూవీకి కృతిశెట్టి ఎంపిక కావడం గమనార్హం.కూచిపూడిలో శిక్షణ తీసుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కితే మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే ఈ బ్యూటీ తెలుగు భాషను నేర్చుకోవడం గమనార్హం.