తెలుగు మీడియా రంగంలో టీవీ-9 ఎంట్రీ ఓ సరికొత్త అధ్యాయం.ఇంకా చెప్పాలంటే మీడియాలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
ఎన్నో స్టింగ్ ఆపరేషన్లు, డేరింగ్ కథనాలు ఓవరాల్గా ఎలక్ట్రానిక్ మీడియాను టీవీ-9 ఎన్నో సరికొత్త పుంతలు తొక్కించింది.కొద్ది రోజులుగా టీవీ-9ను అమ్మేస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి.
ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్కు అత్యంత ఆప్తుడైన మై హోమ్ సిమెంట్స్ అధినేత రామేశ్వరరావు టీవీ-9ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని….రూ.650 -700 కోట్లకు ఈ డీల్ సెట్ అయినట్టు కూడా టాక్ బయటకు వచ్చింది.తర్వాత ఆ ప్రచారం సైలెంట్ అయ్యింది.
ఇక తాజాగా ఇప్పుడు మరోసారి టీవీ-9 సేల్ మ్యాటర్ తెరమీదకు వచ్చింది.టీవీ-9ని జీ టీవీ గ్రూప్ కొనుగోలు చేస్తోందనే వార్తలు ఏపీ సచివాలయంలో వెలగపూడిలో జోరుగా వినిపిస్తున్నాయి.గత రెండు రోజులుగా వెలగపూడిలో రాజకీయ వర్గాలు, మీడియా వర్గాల్లో ఇదే ప్రధాన అంశంగా చర్చ జరుగుతోంది.ఎస్సెల్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న జీ-టీవీ బృందం టీవీ-9ని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తోందట.
ఇప్పటికే ఈ డీల్కు సంబంధించి ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్టు టాక్ వినిపిస్తోంది.
జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర తన మీడియా సామ్రాజ్యాన్ని ఏపీ, తెలంగాణలో భారీ ఎత్తున విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే జీ సినిమాలు, జీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.రకరకాల ప్రోగ్రామ్స్తో పాటు కొత్త సినిమాలు కొనుగోలు చేసి రన్ చేయడంపై దృష్టి పెట్టారు.ఈ క్రమంలోనే ఆయన మీడియా రంగంలో నెంబర్ వన్ న్యూస్ ఛానెల్గా ఉన్న టీవీ-9 ను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
టీవీ-9కు తెలుగులో జై తెలంగాణ టీవీతో పాటు ఇంకా కన్నడ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళతో పాటు ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ టీవీ-9 కూడా ఉంది.మరి జీ గ్రూప్ వారు కేవలం టీవీ-9 మాత్రమే కొనుగోలు చేస్తారా ? లేదా ? ఈ గ్రూప్కు ఉన్న అన్ని ఛానెల్స్ను కొంటారా ? అన్నది మాత్రం తెలియడం లేదు.సుభాష్ చంద్ర తన వ్యాపార విస్తరణపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు ఏపీ సచివాలయం వెలగపూడికి వచ్చారు.
దీంతో ఈ అంశంపై వెలగపూడిలో హాట్ డిస్కర్షన్ జరుగుతోంది.