ఈ కరోనా కాలంలో పక్కన మనిషి చచ్చిపోయిన పట్టించుకోని మనుషులు ఉన్నారు.పచ్చిగా చెప్పాలంటే మనుషులలో మానవత్వం చచ్చిపోయింది.
కానీ అదేంటో.జంతువులలో మాత్రం మంచితనం పుట్టుకొచ్చింది.
చచ్చిపోయే వాటికి వైద్యం చేసినట్టు సహాయం చేసి మరి బ్రతికించుకుంటున్నాయ్.కష్టాల్లో ఉన్న స్నేహితులను కాపాడుకుంటున్నాయ్.
ఇప్పుడు అంతగా ఏమైంది అనుకుంటున్నారా.అయితే ఇది చదవండి.ఓ రెండు జీబ్రాలు అలా అలా నడుచుకుంటూ వెళ్తున్నాయి.ఇంతలో రెండు జీబ్రాలలో ఒకదాని మెడను నోటితో పట్టేసుకుంది ఆ సింహం.
కాసేపు ఆగితే దాని ప్రాణం తీసి తినేసేది.కానీ రెండో జీబ్రా చూస్తూ ఉండిపోలేదు.
భయపడుతూనే దాని ఫ్రెండ్ ని సింహం నుంచి రక్షించాలనుకుంది.
అలానే వెనుక కాళ్లతో సింహాన్ని కొట్టి తరిమేసింది.అనంతరం ఆ ఫ్రేండ్ జీబ్రాను రక్షించుకొని పక్కకు వెళ్ళింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రాజ్ శేఖర్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
ఇలాంటి గొప్పతనం ఎంతోమంది మనుషులలో చచ్చిపోయింది.కానీ జంతువుల్లో ఇంకా మిగిలే ఉంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరి మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.