వైవిఎస్ చౌదరి పేరు వింటే లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి.కెరియర్ ఆరంభంలో హిట్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటూ స్టార్ దర్శకుడుగా హవా కొనసాగించిన చౌదరి తరువాత ఒక్క మగాడు, రేయ్ లాంటి సినిమాలతో పూర్తిగా కనిపించకుండా పోయాడు.
ఈ రెండు సినిమాలకి దర్శకుడుగా చేస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరించి అవసరానికి మించి బడ్జెట్ పెట్టాడు.సినిమాలో కంటెంట్ కంటే ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉందని ఆడియన్స్ తిరష్కరించారు.
ఇక సాయి తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ రేయ్ అనే మూవీ ఏకంగా వెస్ట్ ఇండీస్ లో షూట్ చేశారు.ఈ మూవీ కోసం విపరీతంగా ఖర్చు పెట్టేయడంతో చివరికి రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
కనీసం రెండేళ్ళు ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ కి నోచుకోలేదు. దేవదాసు తర్వాత ఒక్క మగాడు అంటూ బాలకృష్ణని భారతీయుడు రేంజ్ లో ఎలివేట్ చేయాలని ట్రై చేసి దారుణంగా ఫెయిల్ అయ్యాడు.
తరువాత మంచు విష్ణు, మోహన్ బాబు కాంబోలో సలీం మూవీతెరకెక్కించి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు.తరువాత నిర్మాతగా రవితేజతో నిప్పు మూవీ చేసి దెబ్బ తిన్నాడు.
ఇక తేజ్ తో ఆరేళ్ళ క్రితం రేయ్ మూవీ తర్వాత చౌదరి సైలెంట్ అయిపోయాడు.అయితే తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా గ్యాప్ తర్వాత మొదటి సారి మీడియా ముందుకొచ్చాడు.
కరోనా లాక్ డౌన్ తర్వాత తన నెక్స్ట్ సినిమాని ఎనౌన్స్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.అలాగే ఈ సినిమాలో తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తానని కూడా చెప్పడం విశేషం.
మరి వైవిఎస్ చౌదరితో సినిమా చేసే అవకాశాన్ని ఎవరు అందుకుంటారు అనేది చూడాలి.