తెలంగాణ రాజకీయాలలో ఈ ఏడాది ఫిబ్రవరి మాసం నుండి వైయస్ షర్మిల చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని.
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తాను అంటూ వైఎస్ షర్మిల ప్రకటించి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ ని అభిమానించే కార్యకర్తలతో అదేరీతిలో నాయకులతో ఆత్మీయ సమ్మేళనం పేరిట జిల్లాల వ్యాప్తంగా షర్మిల భేటీ కావడం తెలిసిందే.
ఇక ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం దీక్ష కూడా చేయడం జరిగింది.
ఆ తర్వాత “వైఎస్సార్ టిపి” అనే పార్టీ పెట్టినట్లు.షర్మిల ప్రకటించటం జరిగింది.ఇదిలా ఉంటే జూలై 8 వ తారీకు వైయస్ జయంతి సందర్భంగా.
ఆ రోజు పార్టీ విధివిధానాలు తెలపడానికి షర్మిల అండ్ టీమ్ రెడీ అవుతుంది.ఇటువంటి తరుణంలో ఈ కొత్త పార్టీకి సంబంధించి జెండా ఆరోజు ఆవిష్కరించడానికి కి ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ జండా డీటెయిల్స్.చూస్తే ఈ విధంగా ఉన్నాయి.
దాదాపు జెండా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగు ఎనభై శాతం… 20 శాతం నీలం రంగుతో జెండా రూపొందించిన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ నెల 8 వ తారీఖున వైయస్ జయంతి సందర్భంగా.
పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు.