వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.వైయస్ షర్మిల.
పార్టీని బలోపేతం చేయడం కోసం కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పార్టీ స్థాపించాక ముందే రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం పోరాడుతూ.
ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న షర్మిల.టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపిస్తుంది.
కేవలం ఎన్నికల ప్రచారంలో మాత్రమే హామీ ఇచ్చారని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను.కెసిఆర్ పట్టించుకోలేదని ధ్వజమెత్తుతున్నారు.
ఇదిలా ఉంటే మరో పక్క సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుంటూపోతూ.పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తున్నారు.
ఈ క్రమంలో మొన్న బీసీ వర్గాలకు సంబంధించి.భారీ కార్యక్రమం చేపట్టిన షర్మిల తాజాగా ముస్లిం పెద్దల తో సమావేశం అయ్యారు.హైదరాబాద్ పాతబస్తీలోని తలబ్ కట్టకు.వెళ్లిన షర్మిల దేశంలోనే అతిపెద్ద ముస్లిం పెద్ద సంస్థ అయిన జమియతే ఉలేమాయే హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముఫ్తీ ఘయాస్ రహ్మానీ, ప్రధాన కార్యదర్శి ముఫ్తీ జుబేర్ ఖాస్మిలను కలిశారు… ఇదే సమయంలో వివిధ జిల్లాల మత పెద్దలను కూడా షర్మిల కలవడం జరిగింది.
అనంతరం సద్దుల బతుకమ్మ వేడుకల్లో.షర్మిల పాల్గొన్నారు.ఒకపక్క అన్ని సామాజిక వర్గాలతో.భేటీ అవుతున్న షర్మిల మరో పక్క రాజకీయంగా.పార్టీని మరింత బలోపేతం చేసే తరహాలో.రానున్న రోజుల్లో కీలక నిర్ణయాలు.
తీసుకుంటున్నట్లు పార్టీ అంతర్గతంగా వినబడుతున్న టాక్.