తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ హవా! టైమ్స్ నౌ సర్వే వెల్లడి

ఓ వైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, మరో వైపు ఆంధ్రాలో అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.ఇక ఏపీలో అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచి తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాయి.

 Ysrcp Will Be Win In Ap Times Now Survey1-TeluguStop.com

అయితే ఎ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.ఎవరికి వారు తమకి మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు.

ఇక చంద్రబాబు ఓ అడుగు ముందుకి వేసి తమకి 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని అంటున్నారు.ఇదిలా ఉంటే ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో జాతీయ చానల్స్ తమ సర్వేలని ప్రకటిస్తున్నాయి.

ఇప్పటికే చాలా వరకు జాతీయ చానల్స్ తమ సర్వేలలో ఏపీలో ఈ సారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి.తాజాగా టైమ్స్ నౌ కూడా తన సర్వే రిపోర్ట్ ని బయట పెట్టింది.

రాబోయే లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో టీఆర్ఎస్ 13 సీట్లు, బీజేపీ 2, కాంగ్రెస్ 1, ఎంఐఎం ఒక్క సీటు తెచ్చుకుంటాయని ప్రకటించారు.ఇక ఏపీలో 25 లోక్ సభ సీట్లకి గాను 22 సీట్లు వైసీపీ సొంతం చేసుకోగా టీడీపీ మూడు సీట్లకి పరిమితం అవుతుందని స్పష్టం చేసింది.

దీనిని బట్టి అసెంబ్లీ ఎన్నికలలో కూడా వైసీపీ గెలుస్తుందనే విషయం అర్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube