వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు కి చిన్న మెదడు చితికి పోయినటు ఉంది, అందువల్లే చిత్రవిచిత్ర డిమాండ్లు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో సీరియస్ అయ్యారు.“కుట్రలతో నిమ్మగడ్డ, చంద్రబాబు మోకాలడ్డాలనుకున్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక పల్లెల్లో గడప గడపకూ రేషన్.
స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో ఎన్నికలు జరిగినా రేషన్ ను ఎవరూ అడ్డుకోలేదు.పేదల తిండి గింజల్ని సైతం అడ్డుకున్నారంటే.
వారికి జనం అంటే ఎంత కడుపుమంటో అర్థం చేసుకోవచ్చు.చిన్న మెదడు చిట్లిపోయి చిత్ర విచిత్ర డిమాండ్లు చేస్తున్నాడు చంద్రబాబు.ఎన్నికల కౌంటింగ్ మండల కేంద్రాల్లో జరపకపోతే కోర్టుకెక్కుతాడట.టీడీపీ ఆఫీసుల్లోనో, కరకట్ట మీదున్న నీ అక్రమ కట్టడంలోనో కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేయకపోయావా? ప్లేస్ మారితే లెక్కమారుతుందా?” అంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చంద్రబాబు ని ఎద్దేవా చేస్తూ ఆయన పై పోస్టు పెట్టారు.