తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత గత కొన్ని రోజులగా రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో తెగ టెన్షన్ పడుతున్నాడు.రాజధాని విషయంలో ఆయన చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తిగత శ్రద్ద చూపుతున్నాడు.
ఆయన ఎందుకు ఇలా చూపుతున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే.ఖచ్చితంగా ఆయన వ్యక్తిగతంగా చాలా టెన్షన్ పడుతూ రాజధాని విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవ చేశాడు.
నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అమరావతిలో భారీగా భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజధాని విషయంలో చర్చ జరుగుతుంటే బుజాలు తడుముకుంటూ ఉన్నాడంటూ ఎద్దేవ చేశాడు.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన భూములను కాపాడుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆయనకు మరేం అక్కర్లేదని, తన వారికి ఉన్న భూమి గురించి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అంటూ విజయసాయి రెడ్డి అన్నాడు.ఆయన మాటలపై తెలుగు దేశం పార్టీ నాయకులు మండి పడుతున్నారు.
నీవు ఇంతకంటే ఎక్కువ ఏం ఆలోచిస్తావు విజయసాయి రెడ్డి అంటూ ప్రశ్నిస్తున్నారు.అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన మీరు మా గురించి మాట్లాడేంత అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు.