ఏపీ అధికార పార్టీ వైసీపీ.ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జిల్లాల పునర్వవ్యస్థీకరణ దాదాపు పట్టాలెక్కింది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు వైసీపీ యుద్ధ ప్రాతిపదికన పావులు కదుపుతోంది.అయితే, ఈ క్రమంలో ఇప్పుడున్న అన్ని జిల్లాల నుంచి చాలా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మా ప్రాంతాన్ని జిల్లా చేయాలంటే.మా ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్లు వైసీపీకి భారీగా వినిపిస్తున్నాయి.
దీంతో ప్రతి జిల్లాపైనా పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు జిల్లాలోని కీలక ప్రాంతమైన పల్నాడు విషయంలో సంచలనం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న పల్నాడు ప్రాంతం .ఇప్పటికీ.అభివృద్ధికి దూరంగానే ఉంది.ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా.ఇక్కడ వెనుకబాటు తనం మాత్రం కొనసాగుతోంది.ఈ క్రమంలో తమ ప్రాంతాన్ని అంటే.
పల్నాడు జిల్లా ఏర్పడితే.జిల్లా కేంద్రంగా పల్నాడునే ఏర్పాటు చేయాలని.
అప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు.ఇక,వైసీపీ సర్కారు ఎలాగూ జిల్లాల ఏర్పాటుకు సిద్ధం అవుతుండడంతో పల్నాడు ప్రజలు, సామాజిక నాయకులు కూడా పల్నాడు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నారు.
కానీ, ప్రభుత్వం మాత్రం రాజకీయంగా పల్నాడు ప్రాంతం వైసీపీకి అంత పనికిరాదని భావించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టి.టీడీపీకి బలంగా ఉన్న నరసరావు పేటపై వైసీపీ పాగా వేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.అంటే… పల్నాడు జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటవుతుందనే అంశంపై సర్కారు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసింది. పల్నాడు జిల్లాకు నరసరావుపేట కేంద్రం కానుంది.
నరసరావుపేటలో భవనాలను, స్థలాలను ఇప్పటికే వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించడం.ఈ విషయానికి బలం చేకూరుస్తోంది.
వాస్తవానికి పల్నాడు ప్రాంతంలోని గురజాల, నరసరావుపేట ప్రాంతాల్లో ఏదో ఒకటి జిల్లా కేంద్రంగా ఏ ర్పాటు అవుతుందని కొంతకాలంగా ప్రచారం జరిగింది.పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే మినహా మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ నరసరావుపేట వైపే మొగ్గు చూపుతున్నారు.
పైగా టీడీపీకి కంచుకోట వంటి నరసరావుపేట అసెంబ్లీ స్థానాన్ని వైసీపీకి ఎప్పటకీ శాశ్వతం చేసేందుకు ఇదే మంచి తరుణమని భావించారు.ఈ క్రమంలోనే పేటను జిల్లా కేంద్రంగా చేసి.
పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసేందుకు వైసీపీ సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.