ఏపీలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసిందని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఎన్నో మంచి పథకాలను జగన్ ప్రవేశపెట్టడాని ఆయన పాలనలో ప్రజలు ఎంతో సంతోషంతో జీవిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నాడు.కొంతమంది దుండగులు ఏపీలో వరస విగ్రహాల ద్వంసం కు పాల్పడుతున్ననేపథ్యంలో సజ్జల నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… టిడిపి అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశాడు.
జగన్ చేస్తున్న మంచి పనులు చూడలేక ఆయనపై బురద చల్లే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నాడని అన్నాడు.అలాగే ఓ రాష్ట్రనికి సిఎం స్థాయిలో ఉన్న నాయకుడు ఇలాంటి పనులు చేస్తాడా అంటూ ప్రశ్నించాడు.విద్యాబాలన్
విగ్రహా ద్వంసంకు పాల్పడిన వారిని పట్టుకుంటామని వారినుండి అన్నీ నిజాలు రాబట్టిన తర్వాత అప్పుడు వెనుక ఎవరు ఉన్నారో తెలుస్తుందని అన్నాడు.ఈ నేపథ్యంలోనే ఏపీలో కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ.అన్నీ రాష్ట్రాలకంటే ఏపీ కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడంలో ఎంతో పురోగతి సాదించిందని అన్నాడు.అలాగే జగన్ చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంకు ప్రజలనుండి మంచి ఆదరణ లభిస్తుంది.
అర్హులైన లబ్దిదారుల అందరికి కుల మత రాజకీయపార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంది.కొంతమంది కావాలనే ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారని సజ్జల అన్నాడు.ఈ పనిని చంద్రబాబు చెయ్యాలకపోయాడని అన్నాడు.అప్పుడు చంద్రబాబు 2020 అంటూ ప్రజలతో ఆడుకున్నాడు.
ఇప్పుడు 2050 అంటూ మరోసారి కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు.చంద్రబాబు ది ట్రూ విజన్ కాదని అది ఫేక్ విజన్ అని అన్నాడు.