నిన్ను నమ్మం బాబూ ! ఇదే వైసీపీ కొత్త కార్యక్రమం

ఏపీ అధికార పార్టీ టీడీపీ మీద ప్రజల్లో ఉండే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.అందుకే ప్రజల్లో తమ పార్టీకి సానుభూతి వచ్చేలా .

 Ysrcp Party Implements News Programme Ninnu Nammam Babu-TeluguStop.com

అదే సమయంలో టీడీపీ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా సరికొత్త కార్యక్రమానికి ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది.అందుకే వినూత్నంగా ” నిన్ను నమ్మం బాబూ ” అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియజేయాలని వైసీపీ చూస్తోంది.

ఈ కార్యక్రమాన్ని మూడు నెలల వరకు చేపట్టాలని వైసీపీ ప్రణాళిక రూపొందించింది.

గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే వాటిల్లో ఐదారు కూడా సరిగా అమలు కాలేదు.కీలకమైన రుణమాఫీ హామీని చంద్రబాబు నాయుడు పూర్తిగా చేయలేకపోయాడు.

అది కప్పి పుచ్చుకోవడానికి ఆ పథకం వర్తించకుండా సగం మంది రైతులను అనర్హులుగా చేసేసి.మిగతా వారికి అరకొరగా ఇచ్చారని ఇక డ్వాక్రా రుణాల రద్దు అనే కార్యక్రమం అంతా బూటకం అని దాని ద్వారా ఎవరూ లబ్ది పొందలేదని వైసీపీ వాదిస్తోంది.

కేవలం మాఫీ హామీకే కాకుండా కులాల వారీగా ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయలేదు.కాపులకు బీసీల హోదా కల్పన, బోయలను ఎస్టీల్లోకి చేర్చడం వంటి హామీలను కూడా ఇచ్చాడు అయితే అవేవీ అమలు కాలేదు.

ఇలా చెబుతూ పోతే చంద్రబాబు హామీలు అన్ని ఉత్తుత్తి హామీలుగానే మిగిలిపోయాయని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.ఇటువంటి విషయాలను గురించి ప్రజలకు వివరిస్తూ … వారిలో చైతన్యం నింపి ప్రజకు చంద్రబాబు చేసింది శున్యం అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ ప్లాన్.

వచ్చే నెల మొదటి వారం నుంచి నిరంతరంగా ప్రజల్లో తిరగాలని ఆ పార్టీ భావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube