డిసెంబర్ 25న ఏపీ సిఎం జగన్ చేబట్టిన ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, ఎంఎల్ఏ లు లబ్ద్ది దారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.ఈ నేపథ్యంలోనే వైసీపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చిత్తూరు జిల్లా కత్తెరపల్లిలో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఈ నేపథ్యంలో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేశాడు.ప్రతి పక్ష నాయకుడు తనకు ఇల్లు లేదని ధరఖాస్తు పెట్టుకుంటే మా ప్రభుత్వం తరుపున ఆయనకు ఇంటి స్థలంను మంజూరు చేస్తాం అన్నాడు.
అలాగే జగన్ చేబడుతున్న మంచి పనులను చూసి ఓర్వలేక బాబు ఆరోపణలు చేస్తున్నాడు.పేదలకు ఇంటి స్థలాలు అందించకుండా అడ్డుతగులుతూ కోర్టులో కేస్ లు వేస్తున్నాడని ఆరోపించాడు.