టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేరెత్తితే చాలు వైసీపీ నాయకులు ఒంటికాలుమీద లేస్తుంటారు.ఆ విషయంలో మరీ ముందుండే వ్యక్తి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.
టెక్నీకల్ పాయింట్స్ మాట్లాడుతూ టీడీపీ ని ఇరుకున పెట్టడం లో విజయసాయి రెడ్డి ది అందివేసిన చేయి.అంతకు ముందు మీడియా వేదికగా విమర్శలు చేస్తూ వస్తున్న విజయసాయి కొద్ధి రోజులుగా… సోషల్ మీడియా వేదికగా తన ప్రతాపం చూపిస్తున్నాడు.
తాజాగా.చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదని.
ఆయన్ను డాక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు.
” రెండు మూడు రోజుల్లో చంద్రబాబు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారట.పెద్ద నోట్ల రద్దు చేసి మోదీ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాడు.అందుకే మా నోట్లు మేమే ముద్రించుకుంటాం.
మేమూ మిలటరీని ఏర్పాటు చేసుకుంటాం.మా రైళ్లు, విమానాలను మేమే నడుపుకుంటాం.2050 దాకా ఎన్నికలు అవసరం లేదని జీఓ తెస్తాం.ఐదేళ్లకోసారి ఎన్నికలతో అభివృద్ధి నిలిచిపోతుంది.
దీన్ని చంద్రం ఎఫెక్ట్ అంటారట” అని విజయసాయి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
” బాబుగారు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు.మొన్న ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ గారిపై హత్యకు స్కెచ్ వేసి అది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రదేశం, మాకేం సంబంధం అన్నారు.ఇప్పుడేమో సీబీఐకి మా రాష్ట్రంలో ఏం పని.అడుగుపెట్టనిచ్చేది లేదంటున్నారు.మానసిక రుగ్మతలన్నీ ఒకేసారి దాడి చేస్తున్నట్లున్నాయి.
చంద్రబాబును డాక్టర్కు చూపించండయ్యా పాపం బ్యాలెన్స్ కోల్పోయాడు” అని వైసీపీ ఎంపీ ట్వీట్ చేశారు.
“ప్రచారం దొరుకుతుందంటే చంద్రబాబు దేనికైనా సిద్ధమే.
ఇరవై లక్షల జనాభాకు మంచి నీరందించే ప్రకాశం బ్యారేజిలో శాశ్వత జల క్రీడల కేంద్రాలను ఏర్పాటు చేస్తాడట.ప్రపంచంలో ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సోర్స్ను జాగ్రత్తగా కాపాడుకుంటారు.
బాబులాగా అపరిశుభ్రం చేయరు” అని సీఎంపై విజయసాయి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.కాగా ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను అదే రేంజ్లో తిప్పికొట్టే తెలుగు తమ్ముళ్లు విజయసాయి తాజా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.