ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వాలో ఆదివార పార్టీ నేతలకు ఒక స్పష్టమైన క్లారిటీ లేకుండా పోయింది.అందుకే ఎవరు ఇష్టమొచ్చినట్టుగా వారు రాజధానిపై స్పందిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు.
ఇప్పటికే రాజధానిని అమరావతిలో కొనసాగిస్తారా లేదా అనే విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది.ఈ నేపథ్యంలోనే మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట, ఆ పార్టీ నాయకులు ఒక మాట చెబుతూ జనాల్లో లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు.
శాసన మండలిలో ఓ సభ్యురాలు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం ఇస్తూ అమరావతి నుంచి రాజధానిని తరలించబోమని క్లారిటీ ఇచ్చారు.కానీ ఆ తరువాత రోజే స్పందించిన బొత్స రాజధానిపై కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందని, ఆ విషయాన్నీ అసెంబ్లీలో చర్చించిన తర్వాతే స్పష్టత వస్తుందంటూ చెప్పుకొచ్చారు.
తాజాగా ఇదే అంశంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు.విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా రాజధాని విషయంలో సీఎం జగన్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విజయసారి రెడ్డి.ఆయన ఓ నెగటివ్ వ్యక్తి అంటూ, జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడలేకనే ఆయనపై టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికను పూర్తి స్థాయిలో సమీక్షించి ఆ తరువాత జగన్ తగిన నిరయం తీసుకుంటారు అంటూ విజయసాయి క్లారిటీ ఇచ్చారు.