అందువల్లే ఏపీకి నిధులు వస్తున్నాయి అంటున్నా వైసీపీ ఎంపీ..!!

ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీకి వైసీపీ మద్దతు ఇవ్వటంలో దాపరికం ఏమీ లేదని అన్నారు.

 Ysrcp Mp Kotagiri Sridhar Sensational Comments On Bjp Details, Ysrcp, Eluru Mp K-TeluguStop.com

మద్దతు ఇస్తున్నందుకే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.అయితే వచ్చే 2024 కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో.

వైసిపికి అవకాశం వస్తే ఏపీకి రావలసిన ప్రత్యేక హోదా విషయంలో కచ్చితంగా పోరాడుతామని, కండిషన్ పెడతామని.ప్రత్యేక హోదా సాధిస్తామని శ్రీధర్ స్పష్టం చేశారు.

మూడు సంవత్సరాలుగా కేంద్రం పెట్టిన ప్రతిబిల్లుకు వైసీపీ మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రమంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

గత కొన్ని రోజులుగా ఎంపీ కోటగిరి శ్రీధర్ జిల్లాలో జరిగిన వైసిపి ప్లేనరీ సమావేశాలలో పాల్గొన్నారు.

మండలాల వారీగా జరిగిన ఈ ప్లీనరీ సమావేశాలకు.

పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు హాజరయ్యారు.ఇదిలా ఉంటే జులై 8, 9 తారీకులలో రాష్ట్ర ప్లీనరీ సమావేశం గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరగనుంది.

 ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి వైసీపీ కార్యకర్తలు మరియు నాయకులు భారీ ఎత్తున హాజరుకానున్నరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube