జగన్ మద్యపాన నిషేధం! అభ్యర్ధులు తాగి ఎన్నికల ప్రచారం

ఏపీ రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉండబోతుంది అనే విషయం అందరికి తెలిసిందే.సోషల్ మీడియానే ఏపీలో ఎన్నికల ఫలితాలని శాసిస్తాయి అని ఇప్పటికే చాలా సర్వే సంస్థలు కూడా చెప్పుకోచ్చాయి.

 Ysrcp Mp Candidate Campaign With Full Drink Mode-TeluguStop.com

సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో ఎన్నికల బరిలో నిలబడే ప్రజా నాయకులు మాటల విషయంలో, చేతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న సోషల్ మీడియాలో యాంటీ ఫాన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు.

ఇప్పుడు వైసీపీ తరుపున ఎన్నికల బరిలో నిలబడుతున్న నాయకులని యాంటీ ఫాన్స్ అడ్డంగా బుక్ చేసేస్తున్నారు.ఎలా అయిన ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఉన్న జగన్ విస్తృతం ప్రచారం నిర్వహిస్తూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు.

అందులోనే విడతల వారీగా మద్యపాన నిషేధం కూడా ఒకటి.చాలా మంది ప్రజా నాయకులుగా ఉన్నవారిలో మద్యపాన వ్యాపారం మీద కోట్లు సంపాదించి ఇప్పుడు నాయకులుగా చలామణి అవుతున్నవారే వైసీపీలో ఉన్నారు.

ఇదిలా ఉంటే వైసీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు తాజాగా సినిమా హీరోల ఫాన్స్ అసోసియేషన్ మీటింగ్లో పాల్గొన్నారు.అందులో ఫుల్ గా డ్రింక్ చేసి రఘురామకృష్ణం రాజు ప్రసంగించడం, అది కాస్తా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు వైరల్ గా మారింది.

జగన్ చెప్పిన మద్యపాన నిషేధంని వాళ్ళ పార్టీ నాయకులే ఫాలో అవడం లేదని, ఇక ప్రజలు ఏం నమ్మకం ఇస్తారని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube