గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్తున్న క్ష‌ణాన జ‌గ‌న్‌కి షాక్‌లు

తెలుగుదేశం పార్టీ హ‌జ్ఞామీల అమ‌లు తీరును గ‌డ‌ప గ‌డ‌ప‌కూ తీసుకెళ్లే ప‌నిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ కార్య్ర‌క‌మాన్ని ఈ రోజు ప్రారంబించగా, కొంద‌రు శాస‌న‌స‌భ్యులు, ఎమ్మెల్సీ ఒక‌రు పార్టీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్నారంటూ వ‌చ్చిన వార్త‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.తూర్పుగోదావ‌రి జిల్లాలో జోతుల నె్ర‌హూ పార్టీ వీడాక‌, జిల్లా పార్టీ అధ్య‌క్షుడు క‌న్న‌బాబు తోడుగా ఉన్న ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వైసీపీని వీడి సైకిల్ ఎక్కే యోచనలో ఉన్నట్లు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.

 Ysrcp Mlc Adireddy Ready To  Jump In Tdp-TeluguStop.com

ఎన్నోఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న త‌మ‌ని కాద‌ని కాం్ర‌గెస్ నేత‌ల‌ని పిలుచుకుని వారికి ప‌నులు పుర‌మాయిస్తుండ‌టంపై ఆదిరెడ్డి గ‌త కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు.పార్టీలో ఆదిరెడ్డి ప‌రిస్ధితి చూసిన బంధువులు కూడా పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిపోవాల‌ని వ‌త్తిడి చేయ‌టంతో జోతుల నెహ్రూ ఇంటిలో ఈ విష‌య‌మై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

కాగా ్ర‌ప‌కాశం, గుంటూరు జిల్లాల‌ల‌కు చెందిన ఓ ఇద్ద‌రు శాస‌న‌స‌భ్యులు కూడా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలతో విసుగుచెందామ‌ని, పార్టీని ఇక వ‌దిలేయ‌ట‌మే త‌రువాయి అన్న చందంగా సన్నిహితుల‌తో మాట్లాడుతుండ‌టంతో గ‌డ‌ప గ‌డ‌ప‌కు పూర్త‌య్యేనాట‌కి ఎంద‌రు పార్టీని వీడుతార‌న్న మీమాంశ పార్టీ ్ర‌శేణుల‌లోనూ క‌నిపిస్తోంది.ఇప్పటివరకు వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన విషయం విదిత‌మే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube