ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రస్తుతం నడుస్తోంది 151 మంది ఎమ్మెల్యేలు, మరి కొంతమంది టిడిపి , జనసేన ఎమ్మెల్యేల బలం ఉండడంతో వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నట్లుగా ఉంది.దీనికి తోడు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, నిరంతరంగా వాటిని అమలు చేస్తున్న తీరు , రామన్న రోజుల్లోనూ వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం తదితర కారణాల తో ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అసంతృప్తి లోనే ఉంటున్నారు.
అయితే వైసిపి ఎమ్మెల్యేలు బాధ మాత్రం మరోలా ఉంది.ఎమ్మెల్యేలుగా తాము గెలిచిన తమ ద్వారా ఏ పనులు కావడం లేదని, పూర్తిగా అధికారులపైనే పరిపాలన కొనసాగుతోందని, తాము జనాల్లోకి వెళ్ళలేక , జనాలు తమకు ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యేలను కోరుతున్న అధికారులు మాత్రం ఎమ్మెల్యేలు మాట వినడం లేదట.
ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయట.
పార్టీ కేడర్ కూడా వివిధ అంశాలలో మేలు చేయాల్సిందిగా ఎమ్మెల్యేలను కోరుతున్న, ఎమ్మెల్యేలు , అధికారులకు ఈ విషయమై సిఫార్సు చేస్తున్నా, అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం, తదితర కారణాలతో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తమకు ఏ విషయాలను ప్రాధాన్యం దక్కడం లేదని పూర్తిగా అధికారుల చేతిలోనే అన్ని పెడుతున్నారని, ఇలా అయితే తమను ఎవరు పట్టించుకుంటారు అని, ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే విషయం పై తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారట.2019 ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లాది రూపాయలు అప్పులు చేశామని, ఇప్పుడు ఆ అప్పులు తీరే మార్గం కూడా లేకుండా పోయిందని, ఏ విషయంలోనూ ఎమ్మెల్యే లకు ప్రాధాన్యత లేకుండా అన్ని వ్యవహారాలు అధికారుల ద్వారా జగన్ చక్కబెడుతున్నారు అనే తీవ్ర అసంతృప్తికి గురవు తున్నారు అట.
అయితే వ్యవహారాలపై పార్టీ సీనియర్లు, ఇంచార్జీ మంత్రుల వద్ద ప్రస్తావించడం తప్పించి, బహిరంగంగా ఈ వ్యవహారంపై స్పందించే పరిస్థితి ఏర్పడింది.ఇటీవల ఈ వ్యవహారంపై విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రజల్లో తమను విలన్లను చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈయనే కాదు మిగతా ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు.