పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వైసీపీ రాబడుతున్నా గాని కొంతమంది నేతలు మాట్లాడుతున్న తీరు ఆ పార్టీ పరువు తీసే విధంగా ఉన్నాయి.ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చినా గానీ కొంతమంది వైసీపీ నాయకులలో అధికార పొగరు తగ్గలేదు అనే వార్తలు వస్తున్నాయి.
ఓటర్లను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది వివిధ పార్టీలకు చెందిన నాయకుల బెదిరింపు వీడియోలు అదేవిధంగా ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవటం తెలిసిందే.
ఈ కోవలోనే తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వీడియో బయట పడటం జరిగింది.వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పోటీకి దిగితే సదరు కుటుంబానికి ప్రభుత్వ పథకాలు మొత్తం కట్ చేస్తామని జోగి రమేష్ సంచలన వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
వార్డు మెంబర్ గా పోటీ చేసిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు.వైసిపి పథకాలు తీసుకుంటూ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా నిలబడతారు అంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు చేశారు.
దీంతో జోగి రమేష్ వీడియో సోషల్ మీడియాలో రావడంతో.నెటిజన్లు అదేవిధంగా సామాన్య జనులు మండిపడుతున్నారు.
ఇదే తరుణంలో విపక్ష పార్టీకి చెందిన నాయకులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు
.