ఎన్నికల వేల అధికార, ప్రతిపక్ష పార్టీలలో నేతల రాకపోకలు ఇప్పటికే మొదలైపోయాయి.ఎన్నికల వేళ సీట్ల సంప్రదింపులలో పార్టీ అధినేతల నుంచి హామీ రాకపోతే టీడీపీ నుంచి వైసీపీ లోకి, అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి నాయకులు చేరేందుకు రెడీ అయిపోతున్నారు.
జనసేన పార్టీలో ఫిరాయింపు నేతలకి అవకాశం లేకపోవడం, ఆ రెండు పార్టీల మధ్యనే చేరికలు, రాకపోకలు సాగుతున్నాయి.మరో నెల రోజులో నోటిఫికేషన్ వచ్చే అవకాశం వున్న నేపధ్యంలో ఇప్పుడు నేతలు ముఖ్యంగా తన అభ్యర్ధిత్వంపైనే ద్రుష్టి పెడుతున్నారు.
ఇదిలా వుంటే గత కొంత కాలంగా వైసీపీ పార్టీకి చెందిన ప్రాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వైసీపీని వీడెందుకు రెడీ అవుతున్నారు.గత కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో వున్నా ఆమె తాజాగా జగన్ ని కలిసిన తర్వాత అధినేత నుంచి కూడా తన టికెట్ పై ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడం ఆమె పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక ఆమెతో పాటు ఆమె భర్త కూడా వైసీపీకి వీడి త్వరలో తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం వుందని తెలుస్తుంది.