తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మండిపడ్డ వైసీపీ మంత్రి..!!

తెలంగాణపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ రాజధానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు.

 Ysrcp Minister Serious Comments On Revanth Reddy Balineni Srinivas Reddy, Rewant-TeluguStop.com

రేవంత్ రెడ్డి  క్యారెక్టర్ లెస్ వ్యక్తి అని తెలిపారు.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు అని తెలుగు కాంగ్రెస్ పార్టీ అని చంద్రబాబునాయుడు ఏది చెబితే రేవంత్రెడ్డి అది మాట్లాడుతారు అని అన్నారు.

భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

అదేరీతిలో రేవంత్ రెడ్డి బాబు భోజనం చేయడం ఆపాలని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

 అమరావతి పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు భారీగా కౌంటర్లు వేస్తే రేవంత్ రెడ్డి అసలు ఆ పార్టీ అంటూ ఏమీ లేదని తెలిపారు.తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కి అమరావతి గురించి ఎందుకు అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం అంటాడు అటువంటి వ్యక్తికి అసలు క్యారెక్టర్ మాత్రమే కాదు సరైన ఓ పార్టీ కూడా లేదు అంటూ మండిపడ్డారు.రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మంత్రి బాలినేని తో పాటు పలువురు వైసిపి నాయకులు కూడా గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube