ఏపీలో పంచాయతీ ఎన్నికల వేడి నేతల మధ్య మాటల తూటాలు పేల్చే రీతిలో ఉంది.క్షణం క్షణం కి మంత్రులు అదేవిధంగా నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలు మీడియాలో సంచలనాలు సృష్టిస్తున్నాయి.
ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీ హౌస్ అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఫుల్లు కాక మీద ఉన్న వైసీపీ మంత్రులు మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నిమ్మగడ్డ ఆదేశాలు అప్రజాస్వామికం అంటూ.వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఎన్నికల కమిషనర్ ని భయబ్రాంతులకు గురి చేయలేదా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించి, చంద్రబాబు ని ఉరి వేయాలని అన్నారు.చట్టానికి లోబడని అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతాం అనటం తప్పెలా అవుతుంది? అని వెల్లంపల్లి పేర్కొన్నారు.ఇదే క్రమంలో ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే నిమ్మగడ్డ ని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని తగిన బుద్ధి చెబుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ మంత్రి వెల్లంపల్లి.