ప్రభుత్వమా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా??

రాజధాని నిర్మాణం రోజు.రోజుకూ అధికార, ప్రతిపక్షాల మధ్య చిలికి చిలికి గాలివానగా మారుతుంది.

 Ysrcp Fires On Ap Government-TeluguStop.com

ఒక పక్క ఏదో విధంగా రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంటే, ప్రభుత్వం భూముల్ని అమ్ముకుంటుంది అని, ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తుంది.సేకరించిన భూమిలో దాదాపు 5 వేల ఎకరాలు అమ్ముకోవాలని నిర్ణయించిందంటూ వైకాపా ప్రచారం చేస్తూ ఉండడం రాజధాని ప్రాంతంలో కలకలం సృష్టిస్తుంది.

ఒక్కో ఎకరం 15 కోట్ల రూపాయలకు సింగపూర్ కంపెనీలకు అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అని, మొత్తం దాదాపు లక్ష కోట్ల రూపాయల సొమ్ము రాజధాని భూముల అమ్మకం ద్వారా సంపాదించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని, ఐతే ప్రభుత్వమే ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమేంటని ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆరోపిస్తోంది.అసలు రాజధాని కోసమే ఈ భూముల సేకరణ చేస్తున్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నారా? అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.ఈ విమర్శలపై ప్రభుత్వం పెద్దగా స్పందించకపోయినా వైకాపా మాత్రం ప్రభుత్వాన్ని ఏదో రకంగా చిక్కుల్లో పెట్టే ప్రయత్నాలు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube