ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న చాలా నిర్ణయాలపై హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.అమరావతి భూముల నుంచి, ఇంగ్లీష్ భాష, పంచాయితీ బిల్డింగ్స్ కి రంగులు, అలాగే డాక్టర్ సుధాకర్ వ్యవహారం, భూముల అమ్మకం వంటి కీలక అంశాలలో హైకోర్టు నుంచి ఏపీ ప్రభుత్వానికి అడ్డు పుల్లలు పడుతూనే ఉన్నాయి.
ఈ నేపధ్యంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంత కాలంగా హైకోర్టు న్యాయమూర్తులకి కూడా పార్టీ రంగు అంటించి విమర్శలు చేస్తున్నారు.సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి తరుచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
తాజాగా మరో సారి ఏపీ ప్రభుత్వంకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
లాక్ డౌన్ కి ముందు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలని అప్పటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ తో సహా వైసీపీ నాయకులు అందరూ అసహనం వ్యక్తం చేశారు.
నిమ్మగడ్డ చంద్రబాబు మనిషి అని ప్రచారం చేశారు.ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం ఎలక్షన్ కమీషనర్ పదవీ కాలం తగ్గిస్తూ జీవో తీసుకొచ్చి నిమ్మగడ్డని పదవి నుంచి తొలగించారు.దీనిపై అతను హైకోర్టుని ఆశ్రయించారు.
అతని స్థానంలో కొత్త ఎలక్షన్ కమిషనర్ గా జస్టిస్ కనగరాజ్ ని నియమించింది.ఈ కేసు విచారించిన హైకోర్టు ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ని కొట్టివేసింది.
తిరిగి రమేశ్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ గా నియమించి అతని పదవీకాలం ముగిసేంత వరకు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.