ఇదేం విడ్డూరం : సమాధికి వైసీపీ రంగులు ?

ఏపీలో ప్రభుత్వ అ కార్యాలయాలు అన్నిటికీ అధికార పార్టీ కి చెందిన జెండా రంగులను కార్యాలయాలకు వేస్తూ కొత్తవాటిలా వాటిని ముస్తాబు చేస్తున్నారు.ఈ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.

 Ysrcp Clours For The Tomb-TeluguStop.com

గత టిడిపి ప్రభుత్వంలో చాలావరకు ఆ పార్టీ కి సంబంధించిన రంగును వేశారు.ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో టిడిపి ఆనవాళ్లు ఏవి లేకుండా చేస్తున్నారు.

ఈ క్రమంలో గుడి బడి అనే తేడా లేకుండా వైసీపీ రంగులు దర్శనమిస్తున్నాయి.

ఇటీవల అనంతపురం జిల్లాలో ఓపెన్ చేతి కార్యాలయానికి వైసిపి రంగులు వేసే నిమిత్తం అక్కడ ఉన్న జాతీయ జెండాను సైతం చెరిపేసి దానికి వైసిపి రంగులు వేయడం వివాదాస్పదమైంది.

ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైసీపీ పై విమర్శలు రావడంతో కలెక్టర్ జోక్యం చేసుకుని మళ్లీ రంగులు మార్పించారు.

తాజాగా వైసిపి పార్టీ రంగులకు సంబంధించి మరో ఫోటో వైరల్ గా మారింది.

స్మశానంలో సమాధికి ఓ పెయింటర్ వైయస్సార్సీపి కి సంబంధించిన రంగులు వేయడం, సమాధికి ఇంకా రంగులు వేస్తున్నట్టుగా అతను కూడా అక్కడే ఉన్నట్టుగా ఆ చిత్రంలో కనిపిస్తున్నాడు.ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాకపోతే ఈ ఫోటో నిజంగా ఆ విధంగా జరుగుతున్నప్పుడు తీసిందా లేక వైసీపీని నవ్వుల పాలు చేసేందుకు ఈ విధంగా ఫోటో మార్పింగ్ చేసుకున్నారా అనే విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube