ఏపీలో ప్రభుత్వ అ కార్యాలయాలు అన్నిటికీ అధికార పార్టీ కి చెందిన జెండా రంగులను కార్యాలయాలకు వేస్తూ కొత్తవాటిలా వాటిని ముస్తాబు చేస్తున్నారు.ఈ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.
గత టిడిపి ప్రభుత్వంలో చాలావరకు ఆ పార్టీ కి సంబంధించిన రంగును వేశారు.ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో టిడిపి ఆనవాళ్లు ఏవి లేకుండా చేస్తున్నారు.
ఈ క్రమంలో గుడి బడి అనే తేడా లేకుండా వైసీపీ రంగులు దర్శనమిస్తున్నాయి.
ఇటీవల అనంతపురం జిల్లాలో ఓపెన్ చేతి కార్యాలయానికి వైసిపి రంగులు వేసే నిమిత్తం అక్కడ ఉన్న జాతీయ జెండాను సైతం చెరిపేసి దానికి వైసిపి రంగులు వేయడం వివాదాస్పదమైంది.
ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైసీపీ పై విమర్శలు రావడంతో కలెక్టర్ జోక్యం చేసుకుని మళ్లీ రంగులు మార్పించారు.
తాజాగా వైసిపి పార్టీ రంగులకు సంబంధించి మరో ఫోటో వైరల్ గా మారింది.
స్మశానంలో సమాధికి ఓ పెయింటర్ వైయస్సార్సీపి కి సంబంధించిన రంగులు వేయడం, సమాధికి ఇంకా రంగులు వేస్తున్నట్టుగా అతను కూడా అక్కడే ఉన్నట్టుగా ఆ చిత్రంలో కనిపిస్తున్నాడు.ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాకపోతే ఈ ఫోటో నిజంగా ఆ విధంగా జరుగుతున్నప్పుడు తీసిందా లేక వైసీపీని నవ్వుల పాలు చేసేందుకు ఈ విధంగా ఫోటో మార్పింగ్ చేసుకున్నారా అనే విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది.