వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ సచివాలయాలు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.అంతే కాదు పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేపట్టింది.
ఇక కొత్తగా సచివాలయాలకు రంగులు వేయించే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.అయితే ఆ రంగులు వైసీపీ పార్టీ కలర్ లో ఉండడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.
దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కుంటోంది.తాజాగా ఈ రంగుల అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ స్పందించారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నిటికీ రంగులు మార్చుకుంటూ వెళ్తోందని, దేనిని వదిలిపెట్టేలా కనిపించడంలేదని కన్నా విమర్శించారు.గుళ్ళు బళ్ళు అనే తేడా లేకుండా అన్నిటికి రంగులు వేసుకుంటూ వెళ్తోందని, వీటిని వదిలిపెట్టేలా కనిపించడంలేదని కన్నా విమర్శించారు.
తాజాగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలకు వేసిన వైసీపీ జెండా రంగుల ఫొటోలను కన్నా ట్విటర్లో పోస్టు చేశారు.ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది.బడినీ, గుడినీ వదలని వైసీపీ వాళ్లు అవకాశం ఉంటే ఇసుక, ఇంద్రధనస్సుకు కూడా పార్టీ రంగులు వేసేలా కనిపిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.