ఓ వైపు జగన్... మరో వైపు బీజేపీ! టీడీపీని భూస్థాపితం కోసం

ఏపీ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ తరువాత ఇంతకాలం ఆ స్థాయిలో తనదైన ముద్ర వేసుకొని తెలుగు ప్రజల కోసం పని చేసిన ప్రాంతీయ పార్టీ తెలుగు దేశం భవిష్యత్తు ఇప్పుడు ప్రస్నార్ధకంగా మారుతుందా అంటే అవుననే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.చంద్రబాబు వయస్సు రీత్యా ఇప్పుడు పార్టీని నడపడం చాలా పెద్ద భారం అవుతుందని.

 Ysrcp And Bjp Concentrate On Tdp Party-TeluguStop.com

ఉన్నపళంగా పార్టీకి చంద్రబాబు వారసుడుని ఎంపిక చేయాల్సిన అవసరం వచ్చింది.అయితే తన తర్వాత తన కుమారుడు నారా లోకేష్ చేతికే పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్న బాబుతో చాలా మంది తెలుగు తమ్ముళ్ళు గొంతు కలపడానికి ఇష్టపడటం లేదు.

ఇదిలా ఉంటే ఏపీలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి ఆ స్థానంలో తాము కూర్చోవాలని జాతీయ పార్టీ బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది.ఇప్పుడు టీడీపీలో లోకేష్ నాయకత్వం మీద పార్టీ క్యాడర్ లో ఉన్న వ్యతిరేకతని తమకి అనుకూలంగా మార్చుకొని అందరిని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు.

పార్టీలు మారడంలో సిద్ధహస్తులైన తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో సొంత లాభం కోసం కలిసి వెళ్లేందుకు సిద్ధం అయిపోతున్నారు.చంద్రబాబు మీద అవినీతి కేసులు బనాయించి, ఇప్పటి వరకు కోర్ట్ లలో స్టేలో ఉన్న కేసులు అన్ని బయటకి తీసి అతనిని అరెస్ట్ చేయడం ద్వారా పార్టీని ఏకాకిని చేసి నేతలని బీజేపీలో కలిపెసుకోవాలని చూస్తుంది.

ఇక అధికార పార్టీ వైసీపీ కూడా టీడీపీ మీద వ్యక్తిగతంగా దాడి చేసి దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube