జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే.తన చుట్టుపక్కల సెక్యూరిటీ గా ఉండే చాలామందికి కరోనా సోకడంతో వెంటనే పవన్ కళ్యాణ్ ముందు జాగ్రత్తగా స్వీయ నియంత్రణ లో వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ పార్టీ నేత అంబటి రాంబాబు పవన్ పై సీరియస్ కామెంట్ చేశారు.తిరుపతి ప్రెస్ క్లబ్ లో అంబటి రాంబాబు మాట్లాడుతూ.
బీజేపీ పార్టీ జాతీయ నేత జేపీ నడ్డా ఇటీవల తిరుపతి లో పర్యటించిన క్రమంలో రాజకీయ మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని స్పష్టం చేశారు.
కానీ పరిస్థితి చూస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా పాల్గొన లేదు.
ఆయన ప్రస్తుతం కరోనా వస్తుందేమో అంటూ క్వారంటైన్ లో ఉన్నారు.భయపడి కరోనా అని చెప్పి పవన్ కళ్యాణ్ క్వారంటైన్ కి వెళ్లిపోయారా లేకపోతే కరెన్సీ అందాకా క్వారంటైన్ కి వెళ్లారా అంటూ మీరే తేల్చాలి అంటూ బిజెపి పార్టీ నేతలపై అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్ చేశారు.
ఇదే విషయంపై ఏపీ రాజకీయాలలో రక రకాల గుసగుసలు కూడా వినబడుతున్నాయి అని పేర్కొన్నారు.