ఏపీ ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది.పేద కుటంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థికసాయం చేయనుంది.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.రేపటి నుంచి ఈ పథకం అమల్లోకి రానుండగా.కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ.1.2 లక్షలు ప్రభుత్వం అందించనుంది.వైఎస్ఆర్ కల్యాణమస్తులో ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు, షాదీ తోఫాలో ముస్లిం, మైనార్టీలకు రూ.లక్ష, వికలాంగుల వివాహానికి రూ.1.5 లక్షలు అందించనున్నారు.ఈ పథకానికి అప్లై చేసుకునే వధూవరులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు.