దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జగన్ సర్కార్ పాలన విషయంలో ఏపీలో సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.ప్రభుత్వ పథకాలు చాలావరకూ ప్రజల ఇంటివద్దకే అందే విధంగా పాలన అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పటికే రేషన్ కోసం ప్రత్యేకమైన వాహనాలను ఏర్పాటు చేసి ఫిబ్రవరి ఫస్ట్ తారీకు నుంచి ఇంటి వద్దకే రేషను అందేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
అంతకుముందు పెన్షన్లు నిన్న రేషన్ తాజాగా వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు ద్వారా వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8585 హెల్త్ క్లినిక్ లు నిర్మాణానికి రెడీ అయ్యింది.ఈ హెల్త్ క్లినిక్ల కోసం దాదాపు ఒక 1692 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వైయస్సార్ హెల్త్ క్లినిక్ మార్చి నెలాఖరు నాటికి. పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పటి నుండే పనులపై దృష్టి పెట్టింది.