టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ మంత్రి మేరుగు నాగార్జున సవాల్ విసిరారు.అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు.
పెయిడ్ ఆర్డిస్టులతో మాట్లాడిస్తున్న చంద్రబాబు తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.అంబేద్కర్ విద్యా దీవెన పథకం టీడీపీ పాలనలో నిర్వీర్యం అయిందన్నారు.
అదేవిధంగా టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ కోనసాగుతుందని చెప్పారు.అంబేద్కర్ పేరుతో ఉన్న స్కీములు ఆపేసింది టీడీపీ అధినేతే అని ఆరోపించారు.
ఇప్పుడు కూడా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని అడ్డుకున్నారని విమర్శించారు.