విద్యార్ధి నేతలని బెదిరించిన ఎమ్మెల్యే... ఎక్కువ చేస్తే తన్ని పంపిస్తా

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ తరుపున గెలిచినా ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.రాజకీయ విలువలు కూడా తలదించుకునే విధంగా వ్యక్తిగత దూషణల నుంచి, అసభ్య పదజాలంతో దూషించుకోవడం వరకు వెళ్తున్నారు.

 Yscrp Mlaabusing Wordson Students Leaders-TeluguStop.com

అసెంబ్లీలో కూడా ఏ మాత్రం నియంత్రణ లేకుండా నోటికి పనిచెబుతున్నారు.ఇక మీడియా చానల్స్ లో అయితే వైసీపీ నేతలు మాటలకి అదుపే ఉండటం లేదు.

ఎదురుదాడి చేయడానికి వ్యక్తిగత దూషణలని ఎజెండాగా వెళ్తున్న వాళ్ళు అన్ని చోట్ల తమ నియంతృత్వ ధోరణిని చూపిస్తున్నారు.ఇష్టారాజ్యంగా మాటలతో రెచ్చిపోతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా గుంటూరులో నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఒక కాలేజీ ఉంది.అందులో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్ధి నేతలు కాలేజీకి వెళ్ళారు.

అక్కడికి వెళ్ళిన వారిపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు.నా పర్మిషన్ లేకుండా నా కాలేజీలోకి ఎలా వస్తారంటూ బెదిరించారు.

మీరు విద్యార్ధి నేతలితే నేను ఎమ్మెల్యేని అని, ఏదైనా సమస్య ఉంటె ముందు నా అనుమతి తీసుకొని రావాలని నాతో మాట్లాడాలని, ఇష్టానుసారంగా కాలేజీలోకి వస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు.ఫీజులు గురించి అడిగితే మీకు సేవ చేయడానికి నేను ఇక్కడ కాలేజీ పెట్టలేదని, ఇష్టమైతే ఉండండి, లేదంటే వెళ్ళిపొండి అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మీరు కాలేజీ మీద పది మందితో వస్తే నేను వెయ్యి మందిని తీసుకొస్తా అని అందరిని కొట్టి పంపిస్తా అంటూ బెదిరించారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఎమ్మెల్యే విద్యార్ధులు అందరికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube