వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసిన వారిని గుర్తించిన పోలీసులు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిది సహజ మరణం కాదని, అతనిని ఎవరో హత్య చేసారని కడప డీఎస్పీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం ప్రాధమిక విచారణకి వచ్చారు.ఈ విషయాన్ని డీఎస్పీ రాకేశ్ దేవ్ శర్మ మీడియా ద్వారా నిర్ధారించారు.

 Ys Vivekanand Reddy Murdered By Some One Mysteries-TeluguStop.com

వివేకా ఒంటిపై ఏడూ చోట్ల బలమైన గాయాలు ఉన్నట్లు చేసిన ఆయన ఘటన స్థలంలో వేలి ముద్రలు కూడా సేకరించామని తెలియజేసారు.దీనిని బట్టి ఆయన్ని ఎవరో హత్య చేసి సహజ మరణం క్రింద క్రియేట్ చేసే ప్రయత్నం చేసారని రాకేశ్ దేవ్ స్పష్టం చేసారు.

వైఎస్ వివేకానందని ఎవరు హత్య చేసి ఉంటారనే విషయం మీద ఇప్పటికే కొంత మంది మీద అనుమానాలు ఉన్నాయని తెలియజేసారు.అయితే ఈ విషయంలో పూర్తిగా నిర్ధారణకి వచ్చిన తర్వాత నిందితులని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

ఎన్నికల ముందు వివేకానంద హత్య చేయడం వెనుక రాజకీయ కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని స్పష్టం చేసారు.అయితే జగన్ తాత రాజారెడ్డి హత్యలో ఒక ముద్దాయిగా జైలు శిక్ష అనుభవించిన సుధాకర్ రెడ్డి మూడు నెలల క్రితం జైలు నుంచి రిలీజ్ కావడం ఇంతలో ఊహించని విధంగా వివేకానంద హత్యకి గురి కావడం వెనుక అతని హస్తం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే వివేకానంద హత్య మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయలలో సంచలనంగా మారింది అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube